TELANGANA MULUGU
సొసైటీ చైర్మన్ పదవి స్థానిక యువ రైతుకే ఇవ్వాలి
యూత్ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ సొలం రాంబాబు డిమాండ్
వార్తాపత్రిక, ములుగు, జూన్ 10: తాడ్వాయి మండల ప్రాథమిక రైతు సహకార సొసైటీ (పీఏసీఎస్) చైర్మన్ పదవిని మేడారం ప్రాంతానికి చెందిన చదువుకున్న యువ రైతుకు కేటాయించాలని యూత్ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ సొలం రాంబాబు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు, వ్యవసాయ అవసరాలపై అవగాహన ఉన్న వ్యక్తికి అవకాశం కల్పిస్తే సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క-సారలమ్మ జాతరకు కేంద్రంగా ఉన్న మేడారం ప్రాంత ప్రజల్లో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత రైతుల అవసరాలు, వ్యవసాయ పరిస్థితులపై అవగాహన ఉన్న యువతకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. రైతులకు పంట రుణాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకునే నాయకత్వం అవసరమని అన్నారు. సహకార సంఘాల నిర్వహణలో పారదర్శకత, రైతు ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది