వార్తాపత్రిక, హైదరాబాద్, జూన్10: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల వంటి కీలక ప్రజాస్వామ్య ప్రక్రియలో నామినేషన్ను తిరస్కరించడం ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలకు తావిస్తుందని అన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసులు నమోదు కాలేదని, విచారణలకు హాజరైన సందర్భం కూడా లేదని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమెపై ఉన్నాయని చెబుతున్న కేసుల వివరాలను వెల్లడించలేదనే కారణంతో నామినేషన్ను తిరస్కరించడం సమంజసం కాదన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నామినేషన్ తిరస్కరణ అంశంపై అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత కోసం అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
TELANGANA HYDERABAD
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై పొన్నం ఆక్షేపణ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది