• Other News
  • Live TV
  • దళిత మహిళపై దాడిచేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాగ జంగయ్య మాదిగ డిమాండ్ చేశారు

    Reporter
    Journalist Chinna Telangana  |  April 16, 2026, 4:44 pm
    దళిత మహిళపై దాడిచేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి                  టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాగ జంగయ్య మాదిగ డిమాండ్ చేశారు

    వార్త పత్రిక షాద్ నగర్ ఏప్రిల్ 16:రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరి గూడ మండల పరిధిలోని ఎదిర గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది ఓదళిత మహిళపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన స్థానికంగా ఆందోళనకు గురి చేసింది మహిళ అని కూడా చూడకుండా కర్కాశంగా వ్యవహరించిన దుండగులపై అటెండ్ మర్డర్ మరియు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులను నమోదు చేసి నిందితులను తక్షణమే రిమాండ్ చేయాలని బాధితురాలుకు తక్షణ సహాయం కింద పది లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వారి కుటుంబానికి రక్షణ కల్పించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీస్ శాఖవారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నిందితులకు కఠిన శిక్షలు వేస్తేనే భవిష్యత్తులో దళితులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయని తెలియజేస్తూ షాద్ నగర్ ఏసిపి గారు ప్రత్యేక చొరవ తీసుకొని నిందితులను తక్షణమే కఠినమైన శిక్షలు వేస్తేనే మహిళా బాధ్యతరాలకు తగిన న్యాయం జరుగుతుందని సింగపాగ జంగయ్య మాదిగ తెలిపారు.

    📰 e-Paper Clip
    Google News Follow