కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22 (వార్తాపత్రిక): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ పరిధిలో శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ మల్లన్న జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నాయకులు, గాజులరామారం మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, జె.కె. శేఖర్ యాదవ్, కూన రాఘవేంద్ర గౌడ్, రావుల పృథ్వి, తదితరులు పాల్గొని అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజలి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, భరత్ కుమార్, సందీప్, ముత్యపాగా నర్సింగ్ రావు, యాదగిరి, సత్యనారాయణ, మంజునాథ్, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TELANGANA MEDCHAL-MALKAJGIRI
గాజులరామారంలో ఘనంగా ఎల్లమ్మ - మల్లన్న జాతర
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది