• Other News
  • Live TV
  • కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీని కలిసిన డిప్యూటీ కమిషనర్లు

    Reporter

    Deprecated: htmlspecialchars(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/vaarthapatrika.com/public_html/single.php on line 257
    January 9, 2026, 8:42 pm
    కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీని కలిసిన డిప్యూటీ కమిషనర్లు

    సైబరాబాద్ : కుత్బుల్లాపూర్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎన్. కోటి రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా పలువురు #GHMC డిప్యూటీ కమిషనర్లు కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుందిగల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్, నిజాంపేట్ డిప్యూటీ కమిషనర్ ఎండి. సాబీర్ అలీ, కొంపల్లి డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి డీసీపీని కలిసి అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ భేటీలో చర్చించారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజల సేవలో మరింత సమర్థంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు.

    📰 e-Paper Clip
    Google News Follow