• Other News
  • Live TV
  • 12 ఏళ్ల పిల్లలూ యుద్ధంలోకి

    Reporter
    Journalist Chinna Telangana  |  March 28, 2026, 1:03 pm
    12 ఏళ్ల పిల్లలూ యుద్ధంలోకి

    టెహ్రాన్‌, మార్చి 27 : అమెరికా, ఇజ్రాయెల్‌తో భూతల యుద్ధం జరగవచ్చని ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా యోధులను ఇరాన్‌ సమీకరించినట్లు తెలిసింది. ఈ 10 లక్షల మందిలో సైనిక సిబ్బంది, వలంటీర్లు ఉన్నట్లు ఇరాన్‌ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ తాస్నిం వార్తాసంస్థ తెలిపింది. సమీకరించిన ఈ దళాలు భిన్న పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యంతో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డు కోర్‌(ఐఆర్‌జీసీకి చెందిన బసీజ్‌(వలంటీర్‌ పారామిలిటరీ ఫోర్స్‌) నియామక కేంద్రాలు, సైన్యంలో దళాల సంఖ్య పెరిగిందని, దేశాన్ని రక్షించంలో పాలుపంచుకునేందుకు సంసిద్ధత తెలియచేస్తూ భారీ సంఖ్యలో యువ ఇరానియన్లు ముందుకు వచ్చారని వర్గాలు పేర్కొన్నాయి. ఖర్గ్‌ ద్వీపంలో తన బలగాలను ఇరాన్‌ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పెంచింది. అదనపు బలగాలతోపాటు గగనతల రక్షణ వ్యవస్థలు, ఆత్మరక్షణ ఉచ్చులను కూడా ద్వీపంలో ఏర్పాటు చేసింది.

    📰 e-Paper Clip
    Google News Follow