టెహ్రాన్, మార్చి 27 : అమెరికా, ఇజ్రాయెల్తో భూతల యుద్ధం జరగవచ్చని ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా యోధులను ఇరాన్ సమీకరించినట్లు తెలిసింది. ఈ 10 లక్షల మందిలో సైనిక సిబ్బంది, వలంటీర్లు ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ తాస్నిం వార్తాసంస్థ తెలిపింది. సమీకరించిన ఈ దళాలు భిన్న పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యంతో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీకి చెందిన బసీజ్(వలంటీర్ పారామిలిటరీ ఫోర్స్) నియామక కేంద్రాలు, సైన్యంలో దళాల సంఖ్య పెరిగిందని, దేశాన్ని రక్షించంలో పాలుపంచుకునేందుకు సంసిద్ధత తెలియచేస్తూ భారీ సంఖ్యలో యువ ఇరానియన్లు ముందుకు వచ్చారని వర్గాలు పేర్కొన్నాయి. ఖర్గ్ ద్వీపంలో తన బలగాలను ఇరాన్ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పెంచింది. అదనపు బలగాలతోపాటు గగనతల రక్షణ వ్యవస్థలు, ఆత్మరక్షణ ఉచ్చులను కూడా ద్వీపంలో ఏర్పాటు చేసింది.
INTERNATIONAL
12 ఏళ్ల పిల్లలూ యుద్ధంలోకి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్స్ వద్ద డంపింగ్ యార్డ్ తొలగించాలి: సీపీఎం డిమాండ్